ఏపీ రాజధానిగా విశాఖ సేఫ్ కాదన్న వార్తలపై స్పందించిన మంత్రి బొత్స

X
ఏపీ రాజధానిగా విశాఖ సేఫ్ కాదన్న వార్తలపై మంత్రి బొత్స స్పందించారు. తుఫాను ముప్పు పొంచి ఉందంటూ..GNరావు, BCG కమిటీలు తమ నివేదికలో పేర్కొన్న మాట వాస్తమేనని.. అయితే ఈ సిఫార్సులపై హైపవర్ కమిటీలో చర్చించి తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అసలు తుఫాను ముప్పులేని నగరం ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించారు బొత్స. చెన్నై, ముంబయిలో రాజధానులు లేవా అని చెప్పుకొచ్చారు. విశాఖకు ఎప్పుడో గానీ తుఫాను రాదని.. కానీ అమరావతికి మాత్రం ఎప్పుడూ వరద వస్తూనే ఉంటుందన్నారు బొత్స.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
