హాథీరామ్జీ మఠంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు: బీజేపీ భానుప్రకాశ్రెడ్డి

X
By - TV5 Telugu |31 Jan 2020 11:27 PM IST
హాథీరామ్జీ మఠంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్రెడ్డి. మఠం మహంత్ అర్జున్ దాస్ను తొలగించి కాళహస్తి ఈవోకు బాధ్యతలు అప్పగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు . హిందూ విశ్వాసాలను కించపరిచేలా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంటోందని ఆరోపించారు. హాథీరామ్జీ మఠం ఆస్తులు, బాధ్యతలను టీటీడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు భానుప్రకాశ్రెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com