ఫ్రిబవరి 4న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సెమీ ఫైనల్ మ్యాచ్

X
By - TV5 Telugu |1 Feb 2020 5:14 AM IST
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ పోటీల్లో టీమిండియా సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 74 పరుగుల తేడాతో ఆసీస్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా పది విజయాలు సాధించిన తొలి జట్టుగా భారత్ ఘనత సాధించింది. ఇక అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో ఇండియా, పాకిస్తాన్ టీమ్లు సెమీ ఫైనలో తలబడనున్నాయి. ఫిబ్రవరి 4 న పోట్చెఫ్స్ట్రూమ్లోని సెన్వేస్ పార్క్లో ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com