కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కలిసిన అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు

By - TV5 Telugu |3 Feb 2020 6:19 PM GMT
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను రాజధాని రైతులు కలిశారు. రైతులతో పాటు అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు, టీడీపీ ఎంపీలు గల్లాజయదేవ్, రామ్మోహన్నాయుడు, కనకమేడల కూడా పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. రాజధాని మార్పు, తమకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు రైతులు. రాజధాని మార్చకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని వినతి పత్రం అందించారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com