రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు: ఈటెల రాజేందర్
![రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు: ఈటెల రాజేందర్ రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు: ఈటెల రాజేందర్](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/02/EETELA.png)
By - TV5 Telugu |5 Feb 2020 6:04 PM GMT
తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. చైనా నుంచి వచ్చే వారికి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఈటెల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వున్న ఉష్ణోగ్రతలకు కరోనా వైరస్ విస్తరించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారని ఈటెల తెలిపారు. ఏదేమైనా అప్రమత్తంగా వుండాలని.. అనుమానం వస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com