ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. ప్రైవేట్ వ్యక్తులు బోర్డులు పెడుతున్నారు: సీపీఐ నారాయణ
By - TV5 Telugu |5 Feb 2020 2:51 PM GMT
విశాఖలోని మధురవాడ పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాలు కబ్జాలకు గురయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విశాఖలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వం భూముల్లో ఆయన పర్యటించారు. భూకబ్జా దారుల్లో వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. ప్రైవేటు వ్యక్తుల బోర్డులు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com