మూడు ముక్కలైన విమానం..
టర్కీలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. దాంతో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. 179 మంది గాయపడ్డారు. పెగాసస్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం ఇజ్మీర్ ప్రావిన్స్ నుండి బయలుదేరి ఇస్తాంబుల్ చేరుకుంది.. అక్కడ సబీహా గోకెన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సమయంలో విమానం రన్వే నుంచి అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. దాంతో విమానం లోనుంచి మంటలు చెలరేగాయి.
ఈ క్రమంలో రన్వే మీద కూలి మూడు ముక్కలైంది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. 177 మంది ప్రయాణికులు మరియు మరో ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఘటనపై టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో ముగ్గురు టర్కీ వాసులు మృతి చెందారని.. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యెర్లికాయ కూడా ఘటనపై ఆరాతీశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com