రక్తాన్నైనా చిందిస్తాం.. రాజధాని సాధిస్తాం : రైతులు

X
అమరావతితోనే భవిష్యత్ అంటూ ఉధృతంగా ఉద్యమం కొనసాగిస్తున్నారు 29 గ్రామాల ప్రజలు. ఓ పక్క కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తూనే.. దీక్షలు కూడా చేస్తున్నారు. రద్దులు వద్దు.. అభివృద్ధి ముద్దు అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు. శుక్రవారం 52వ రోజు మందడం, వెలగపూడిలో 24 గంటల దీక్షలు విడతలవారీగా చేస్తూనే ఉన్నారు. రాజధానిగా అమరావతి ఒకటే ఉండాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఇంకెన్నాళ్లు మొండిగా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
