- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- లబ్ధిదారులందరికీ పెన్షన్లు...
లబ్ధిదారులందరికీ పెన్షన్లు చెల్లిస్తాం: బొత్స

By - TV5 Telugu |7 Feb 2020 5:38 PM GMT
నిజమైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు చెల్లిస్తామని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బొత్స. 7 లక్షల పెన్షన్లు తొలగించామని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పాతవారిలో 4 లక్షల 16 వేల మందిని అనర్హులుగా తేల్చామని.. కొత్తగా మరో 6 లక్షల మందికి పెన్షన్లు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే ప్రతిపక్ష నేత చంద్రబాబు దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com