ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ షాక్.. విద్యుత్ ఛార్జీలు పెంపు
By - TV5 Telugu |10 Feb 2020 3:55 PM GMT
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికి పలు రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుతో మరో బాదుడికి సిద్ధమైంది. 500 యూనిట్లు పైబడి వినియోగదారులకు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలపై ఈ భారం భారీగా పడనుంది. 500 యూనిట్లు దాటితే యూనిట్కు 90 పైసలు పెరగనుంది. 500 యూనిట్లు దాటితే 9 రూపాయల 5 పైసల నుంచి 9 రూపాయల 95 పైసలకు టారిఫ్ ను పెంచింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com