మిస్టరీగా బాలుడి కిడ్నాప్.. తండ్రి ప్రియురాలిపై అనుమానం.. కానీ..

X
By - TV5 Telugu |13 Feb 2020 11:33 PM IST
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బాలుడి మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఈనెల 4న పెదకర అగ్రహారంలో.. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు.. నందు కనిపించకుండాపోయాడు. బాలుడి కోసం మచిలీపట్నం మొత్తం జల్లెడ పట్టినా లాభం లేకుండాపోయింది. దీంతో బాలుడిని కిడ్నాప్ చేసుంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే, బాలుడి తండ్రి ప్రియురాలిపై.. బాలుడి తల్లి అనుమానం వ్యక్తం చేశారు. అయితే, సదరు యువతిని విచారించినా బాలుడి ఆచూకీ దొరకలేదు. దీంతో 9 రోజులుగా బాలుడి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com