ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్ర : చంద్రబాబు

ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్ర : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది టీడీపీ. ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు... ఒంగోలులో ఈనెల 19 నుంచి ప్రజాచైతన్య యాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు చంద్రబాబు మీడియాపైనా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఛార్జీలను పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ కుమారుడి వివాహానికి చంద్రబాబు హాజరయ్యారు.

200 మంది పోలీసు అధికారులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు చంద్రబాబు.సీనియర్‌ అధికారులను సస్పెండ్‌ చేస్తే పోలీసు అధికారుల సంఘం స్పందించదా? అని ప్రశ్నించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు పెడతారని ప్రజలు, వ్యాపారులు భయపడుతున్నారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ‘దిశ’ చట్టంలో లోపాలున్నాయన్నారు చంద్రబాబు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story