నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీ ఖరారు

X
By - TV5 Telugu |17 Feb 2020 11:57 PM IST
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్లను ఉరితీయాలని ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు సోమవారం కొత్త డెత్వారెంట్లు జారీచేసింది. ఈ రోజు విచారణ ప్రారంభమైన వెంటనే, తిహార్ జైలు స్టేటస్ రిపోర్టును కోర్టుకు అందజేశారు. కేసు యొక్క ప్రస్తుత స్థితి గురించి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ కోర్టుకు వివరించారు మరియు నలుగురిలో ముగ్గురికి తమ చట్టపరమైన అవకాశాలను ఇప్పటికే రద్దు చేశారని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com