ఎస్వీబీసీ ఉద్యోగులు 5నెలల్లోనే 50 ఏళ్ల జీవితాన్ని చూపించారు : పృథ్వీరాజ్‌

ఎస్వీబీసీ ఉద్యోగులు 5నెలల్లోనే 50 ఏళ్ల జీవితాన్ని చూపించారు : పృథ్వీరాజ్‌

తనపై ఆరోపణలకు మానసికంగా ఇబ్బందిపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌. పనిచేయండి.. సీఎం కాళ్లు పట్టుకోని అయినా ఉద్యోగాలు పర్మినెంట్ చేయిస్తాన్న దానికి.. ఎస్వీబీసీ ఉద్యోగులు 5 నెలల్లోనే 50 ఏళ్ల జీవితాన్ని చూపించారన్నారు. 11 సంవత్సరాలుగా వైసీపీకి చేసిన కష్టానికి.. సీఎం గుర్తించి ఇచ్చిన పదవికి.. అర్హత లేదని మొదటి రోజే చెప్పి ఉంటే ఆ పదవిని స్వీకరించే వాడిని కాదని పేర్కొన్నారు. తాను ఏడాది కాలంగా మద్యం , మాంసాహరం స్వీకరించడంలేదన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని తెలిపారు. రైతులపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story