కుప్పంలో చంద్రబాబు పర్యటన
By - TV5 Telugu |25 Feb 2020 12:13 PM GMT
ప్రజా చైతన్య యాత్ర చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు వినతులు వెల్లువలా వస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు.. ప్రభుత్వ పథకాలు అందడం లేదని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రస్తుతం సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆయన బస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. తమకు ప్రభుత్వ పథకాలేవి అందడం లేదంటూ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.. మరోవైపు ఈ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com