మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పూజారికి దేహశుద్ధి

X
By - TV5 Telugu |25 Feb 2020 7:04 PM IST
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు మహిళలు. మంచిర్యాల జిల్లాకు చెందిన భక్తులు స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర బోనాలు చేస్తుండగా ఓ వ్యక్తి తప్పతాగి వచ్చి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని పట్టుకుని చితకబాదుతూ ప్రధాన ఆలయం వరకు తీసుకువచ్చారు. తాను రాజన్న ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నానని చెప్పడంతో.. ఆగ్రహం పట్టలేని మహిళలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

