రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దుపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ
BY TV5 Telugu26 Feb 2020 12:33 PM GMT

X
TV5 Telugu26 Feb 2020 12:33 PM GMT
అమరాతి రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు బుధవారం విచారణ జరపనుంది. రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దును సవాల్ చేస్తూ..అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు.. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు.. బుధవారం కీలక తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఇటీవలే కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపులో.. కేంద్రం మౌనంగా ఉండటంపై హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో.. రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Next Story