అమెరికా రోడ్డుప్రమాదంలో ముగ్గురు ఎన్నారైలు మృతి
ఎన్నో ఆశలతో దివ్య, రాజా దేశంగాని దేశం వెళ్లారు. మంచి ఉద్యోగంలో స్ధిరపడ్డారు. సొంతంగా ఇళ్లు కొనుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో అనుకోని విషాదం వారి జీవితాలను చిదిమేసింది. సొంతింటి కలను తీర్చుకునేందుకు సైట్ దగ్గరికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ దంపతులు ఇద్దరు కన్నుమూశారు. ఏడెండ్ల పాపను ఒంటరిని చేశారు.
హైదరాబాద్ ముషీరాబాద్లోని జగదాంబ అపార్ట్మెంట్స్లో నివసించే ఆవుల గౌతమ్, శివలీల దంపతుల కుమార్తె దివ్య. 2007లో ఆమెను మలేషియన్ టౌన్షిప్కు చెందిన రాజా గవినికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్లిద్దరు పెళ్లి తర్వాత అమెరికా వెళ్లారు. వీరు డల్లాస్లోని ఫ్రిస్కోలో ఉంటున్నారు. ఏడేళ్ల పాప ఉంది.రెండో తరగతి చదువుతున్న కూతురు రియాను సోమవారం సాయంత్రం డాన్స్ క్లాస్లో వదిలారు. సొంతింటి ప్రయత్నాల్లో ఉన్న రాజా దంపతులు మిత్రుడు ప్రేమ్ తో కలిసి సైట్ చూసేందుకు వెళ్లి..తిరిగి వస్తుండగా ఓ ట్రక్కువేగంగా డికొన్నది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
రాజా, దివ్య దంపతులది హైదరాబాద్ కాగా, ప్రేమ్ గుంటూరుకు చెందిన వ్యక్తి. దివ్య అమెరికాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుండగా.. రాజా, ప్రేమ్ వెల్స్ఫార్గోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కొల్పోయిన రియా అనాథగా మారింది. ప్రొసిజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మృతదేహాలను ఇండియాకు తీసుకురానున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com