రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు

By - TV5 Telugu |27 Feb 2020 3:12 PM GMT
దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లపై రాష్ట్రపతికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ సహా ఇతర నేతలు రామ్నాథ్ కోవింద్ను కలిశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో ఈశాన్య ఢిల్లీ అట్టుడికిపోయిందని ఫిర్యాదు చేశారు. అల్లర్లలో 34 మంది చనిపోయారని కోవింద్ దృష్టికి తీసుకెళ్లారు. అల్లర్లను నియంత్రించి, ప్రాణనష్టం జరక్కుండా చూడ్డంలో విఫలమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సోనియాగాంధీ మరోసారి డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com