దారుణం.. బాలికపై కామాంధుడు అత్యాచారం
By - TV5 Telugu |27 Feb 2020 1:41 PM GMT
కృష్ణా జిల్లా నూజీవీడులో దారుణం చోటు చేసుకుంది. బాలికపై కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. తండ్రి ఇంకా రాలేదని రాత్రి ఒంటి గంట సమయంలో బాలిక ఇంటికి నుంచి బయటకు వచ్చింది. మీ నాన్నను చూపిస్తాను అని మాయమాటలు చెప్పి పాపను సైకిల్పై ఎక్కించుకొని తీసుకువెళ్లాడు అగంతకుడు. నూజీవీడు ట్రిపుల్ ఐటీ వెనుక వైపుకు తీసుకెళ్లి అత్యాచారం చేసి సంఘటనా స్థలంలో వదిలివేసి పారిపాయాడు. రోడ్డుపై ఏడుస్తున్న పాపను గుర్తించిన పెట్రోలింగ్ పోలీసులు విషయం ఆరా తీశారు. బాలికను విజయవాడ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com