ఢిల్లీ అల్లర్లకు కారకుడిగా భావిస్తున్న ఆప్ కౌన్సిలర్ ఇంటిని చుట్టుముట్టిన బలగాలు

X
By - TV5 Telugu |28 Feb 2020 8:22 PM IST
ఢిల్లీ అల్లర్లపై ఏర్పాటు చేసిన రెండు సిట్ బృందాలు విచారణ వేగవంతం చేశాయి. అల్లర్లకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఇంటివద్ద ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయన నివాసం, ఫ్యాక్టరీలు అల్లర్లకు అడ్డగా మారినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో చాంద్ బాగ్ లోని తాహిర్ ఇంటివద్ద పెద్దయెత్తున సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. పరిస్థితులు పైకి సద్దుమణగినట్టే కనిపిస్తున్నా.. ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com