దోహాలో చారిత్రాత్మక ఘటన.. అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం.. భారత్ హాజరు
By - TV5 Telugu |28 Feb 2020 5:06 PM GMT
దోహాలో శనివారం చారిత్రాత్మక ఘటన చోటుచేసుకోనుంది. అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం జరగనుంది. ఈ మైలురాయి ఒప్పందానికి భారత్ కూడా హాజరుకానుంది. అందులో భాగంగా ఖతార్లోని భారత రాయబారి హాజరుకానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత రాయబారి పి కుమారన్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ ఒప్పందంతో తాలిబాన్లతో కూడిన ఒప్పందం కార్యక్రమానికి భారత్ అధికారికంగా హాజరుకావడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా ఈ చారిత్రాత్మక ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ బలగాలను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. 2001 నుండి ఆఫ్ఘనిస్తాన్ లో 2,400 మంది సైనికులను అమెరికా కోల్పోయింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com