రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును సందర్శించిన మంత్రి కేటీఆర్

X
By - TV5 Telugu |28 Feb 2020 11:10 PM IST
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జలమండలి నిర్మించిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును సందర్శించారు మంత్రి కేటీఆర్. అక్కడ ఏర్పాటు చేసిన 42 నీటి సంరక్షణ పద్ధతులను పరిశీలించారు. వాటర్ హార్వెస్టింగ్పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు కేటీఆర్. జలమండలి సిబ్బంది కోసం రూపొందించిన యునిఫామ్స్తోపాటు.. నీటి సంరక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన రిజిష్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జలమండలి ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు కేటీఆర్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com