విశాఖ ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతల బృందం

X
By - TV5 Telugu |29 Feb 2020 7:46 PM IST
వ్యవస్థల్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని.. గవర్నర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడ్డుకున్న ఘటనపై గవర్నర్కు ఫిర్యాదు చేసింది టీడీపీ నేతల బృందం. మొన్న విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్కు వివరించారు టీడీపీ నేతలు. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులే తరువాత అడ్డంకులు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని గవర్నర్ని కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com