పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి

పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక రైలు, ఒక బస్సు అత్యంత వేగంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు తెలిపారు.
రైలు ప్రమాదానికి క్రాసింగ్ లోపమే కారణమని సమాచారం. క్రాసింగ్ వద్ద సిబ్బంది లేక పోవడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లెవల్ క్రాసింగ్ వద్ద ఒక బస్సు అతి వేగంగా రైలును ఢీకొట్టింది. క్రాసింగ్ వద్ద గేటు వేయకపోవడం, రైలు రాకను బస్సు డ్రైవర్ సరిగా గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. సింధ్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com