సీఎం జగన్తో రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ

X
By - TV5 Telugu |1 March 2020 12:58 AM IST
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. శనివారం ముంబైనుంచి కుమారుడు అనంత్ అంబానీతో కలిసి నేరుగా గన్నవరం వచ్చిన ఆయన తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది. జగన్ను కలిసిన వారిలో అంబానీతో పాటు రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని, విజయసాయిరెడ్డి ఉన్నారు. వాస్తవానికి ఇవాళ్టి సీఎం అధికారిక షెడ్యూల్లో ముఖేష్ అపాయింట్మెంట్ లేకపోవడం విశేషం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com