చక్రద్వారబంధం గ్రామంలో టీడీపీ ప్రజా చైతన్య యాత్ర
By - TV5 Telugu |1 March 2020 2:33 PM GMT
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో టీడీపీ ప్రజా చైతన్య యాత్ర కొనసాగింది. ఈ ప్రజా చైతన్య యాత్రలో మాజీ మంత్రులు యనమల, నిమ్మకాయల చినరాజప్ప, ఇతర నేతలు పాల్గొన్నారు.. ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోడానికే చంద్రబాబు టూరును వైసీపీ అడ్డుకుంటోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. రెండు మూడు రోజుల్లో విశాఖలో జన చైతన్య యాత్ర ప్రారంభిస్తామన్నారు..పేదలకు భూములు ఇవ్వాలి అనుకోవడం తప్పుకాదని.. కానీ దళితుల భూములు లాక్కొన్ని.. ఇతరులకు పంచడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com