రాజధాని మార్పుతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు: ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి

X
By - TV5 Telugu |2 March 2020 11:38 PM IST
రాజధాని మార్పు జరిగితే.. వైజాగ్లో ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు APNGO అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారాయన. రాజధాని మార్పుతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవేమనని.. అయితే తమ జీతాలు మాత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో.. జీతాలు ఆగిపోతాయన్న ఆందోళన ఉందన్నారు APNGO అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com