ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసును చేధించిన పోలీసులు

ఇంటర్‌ విద్యార్థిని హత్య కేసును చేధించిన పోలీసులు
X

కరీంనగర్‌ జిల్లాలో ఫిబ్రవరి 10న హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్ధిని రాధిక మర్డర్‌ మిస్టరీ కేసు ఓ కొలిక్కి వచ్చిది. హత్య జరిగిన 21రోజుల తర్వాత కేసును చేధించారు పోలీసులు. బాలిక తండ్రి కొమురయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాధిక తండ్రే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతనితో పాటు కుటుంబ సభ్యుల ప్రవేయం ఉన్నట్టు తెలుస్తోంది. రాధిక హత్యకేసుకు సబంధించి.. ఆదివారం కేసు రీ- కన్‌స్ట్రక్షన్‌ చేశారు పోలీసులు. డిఎన్‌ఏ నివేదిక, సాంకేతికత ఆధారంగా కేసు విచారణ చేస్తున్నారు. సోమవారం నిందితునులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవవకాశం ఉంది.

Tags

Next Story