కరోనా ఎఫెక్ట్.. యాంటీ వైరస్ మందులు స్ప్రే చేస్తున్న జీహెచ్‌ఎంసీ

కరోనా ఎఫెక్ట్.. యాంటీ వైరస్ మందులు స్ప్రే చేస్తున్న జీహెచ్‌ఎంసీ

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో హైదరాబాద్‌లో అధికారులు అప్రమత్తమయ్యారు. రోగి నివసిస్తున్న సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌ కాలనీలో GHMC అధికారులు యాంటీ వైరస్‌ మందులు స్ప్రే చేశారు. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి.. ఫాగింగ్‌, లైమ్‌ కోటింగ్‌ చేశారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని... పారిశుద్ధ్య విభాగం సూపరింటెండెంట్‌ దేవేందర్‌ తెలిపారు.

Tags

Next Story