మాజీ ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు

ఫరీదాబాద్ టిగాన్ నియోజకవర్గం మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ నగర్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ బుధవారం (మార్చి 04, 2020) దాడి చేసింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు, ఐటి విభాగం తన సోదరులు - మహేష్ నగర్, మనోజ్ నగర్ మరియు రాజు నగర్ లు నివసించే ఇళ్లపై.. అలాగే సెక్టార్ 17 లోని అతని ఇంటితో సహా అర డజను వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసింది. అలాగే ఖేది రోడ్ లో ఉన్న మనోజ్ నగర్ కార్యాలయం,
బంధువు గ్రామాలైన బువాపూర్, అమిపూర్, ఫతేపూర్ మరియు ఫరీద్పూర్ లలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రదేశాలన్నింటిలోనూ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు అక్కడికక్కడే ఉన్న పురుషులు మరియు మహిళల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల వ్యవహారానికి సంబంధించి లలిత్ నాగర్ నివాసంపై ఆదాయ పన్ను అధికారులు ఈ దాడులు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com