వైసీపీని బీసీలు తీవ్రంగా వ్యతిరేకించాలి: యనమల రామకృష్ణ

X
By - TV5 Telugu |6 March 2020 8:04 PM IST
రిజర్వేషన్లను 34శాతం నుంచి 24 శాతానికి పరిమితం చేయడం ద్వారా బీసీలకు చారిత్రక నష్టం కల్గించడానికి వైసీపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ. రిజర్వేషన్ తగ్గింపును బీసీలు, బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. ఇది భవిష్యత్ లో బీసీ నాయకత్వ వృద్దిని దెబ్బతీస్తుందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి, ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

