తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ తీర్మానం

X
By - TV5 Telugu |7 March 2020 11:50 PM IST
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్హాట్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్ తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తూ.. తీర్మానం ప్రవేశపెట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భట్టివిక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అనసూయ, జయప్రకాశ్రెడ్డి, వీరయ్యను సభ నుంచి సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ సభ్యుల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సహనం అవసరం అని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాం అంటే కుదురదని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com