పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్ను త్వరలోనే పూర్తి చేస్తాం : కేటీఆర్

X
By - TV5 Telugu |12 March 2020 4:34 AM IST
ప్రభుత్వం ప్రజా రవాణాలో విషయంలో చాలా సీరియస్గా ఉందన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించామన్నారు. అందులో ప్రజా రవాణాకు చాలా పెద్ద పాత్ర ఉంటుందని చెప్పారు..పాతబస్తీలో మెట్రో రైలు ప్రాజెక్ట్ను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మెట్రో లైన్ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూర్తి చేస్తామన్నారు. మెట్రోలో కేంద్రం వాటా 10 శాతమేనని.. అందులోనూ ఇంకా రూ.250 కోట్లు రావాల్సి ఉందన్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com