ప్రభుత్వం చేపడుతున్న భూసేరణకు కర్నూలులో తీవ్ర వ్యతిరేకత
By - TV5 Telugu |12 March 2020 3:31 PM GMT
పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కర్నూలు జిల్లా నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేదల ఇళ్ల స్థలాల కోసం కుందూ నది భూములను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే, దీనిపై ఆ ప్రాంత రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుందూ నదికి ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com