రిటర్నింగ్‌ అదికారి శోభారాణిని నిలదీసిన సబ్బం హరి

రిటర్నింగ్‌ అదికారి శోభారాణిని నిలదీసిన సబ్బం హరి

ప్రభుత్వం రౌడీరాజ్యం నడుపుతోందని టీడీపీ నేత సబ్బంహరి మండిపడ్డారు. విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలో జరిగిన వైసీపీ దౌర్జన్యకాండపై ఆయన ఆరా తీశారు.స్యయంగా కార్యాలయానికి వెళ్లి కోడ్‌ ఉల్లంఘించిన వైసీపీ నేతల ధోరణిపై రిటర్నింగ్‌ అదికారి శోభారాణిని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పోలీసులను ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలుగా మార్చిందని అసహనం వ్యక్తం చేశారు. 'నా 34ఏళ్ల రాజకీయ జీవితంలో15 ఎలక్షన్లు చూశానని ఇంత అన్యాయంగా ఏ ప్రభుత్వమూ ప్రవర్తించలేదని' సబ్బం హరి ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్ధులు తమకు అన్యాయం జరిగిందని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ప్రత్యర్ధులు వారి వెంటబడి దాడులు చేయడం తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story