నామినేషన్ పత్రాలు లాక్కున్న వైసీపీ నేతలు.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న టీడీపీ అభ్యర్థిని

X
By - TV5 Telugu |13 March 2020 10:00 PM IST
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ అరాచకాలు మామూలుగా లేవు. ఒకటో వార్డ్లో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థినిగా నామినేషన్ వేసేందుకు విజయలక్షి వెళ్లారు. అయితే.. వైసీపీ కార్యకర్తలు ఆమెను అడ్డగించారు. నామినేషన్ పత్రాలను లాక్కున్నారు. వారితో విజయలక్షి వాగ్వాదానికి దిగారు. అక్కడ గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో.. తనకు నామినేషన్ వేసే అవకాశం కల్పించాలంటూ ఆమె కాళ్లావేళ్లా పడ్డారు. అయినా.. అక్కడి వారు కనికరించలేదు. మహిళ అని కూడా జాలి చూపలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com