హైదరాబాద్ శివారులో బాంబ్ పేలుడు కలకలం
By - TV5 Telugu |14 March 2020 1:36 PM GMT
హైదరాబాద్ శివారులోని శివరాంపల్లిలో కలకలం రేగింది. శివరాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లలోని ఫర్నిచర్, ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు ధాటికి జనం భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com