ఎన్నికలు వాయిదా వేసి.. రాష్ట్రానికి నష్టం చేశారు: అవంతి శ్రీనివాస్
By - TV5 Telugu |17 March 2020 8:15 PM GMT
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ, తెలుగుదేశం పార్టీ లీడర్ రాసినట్లుగానే ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపిచారు. కరోనా వైరస్ పేరుతో ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా రాష్ట్రానికి తీరని నష్టం చేశారని విమర్శించారు. రమేష్ కుమార్ ఇంకా చంద్రబాబే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని.. చంద్రబాబు మారి జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్న సంగతి ఆయన గుర్తించాలన్నారు. గోవాలో స్థానిక ఎన్నికలు జరుగుతుండగా, ఇక్కడ ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు మంత్రి అవంతి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com