ఎమ్మెల్సీగా బరిలో దిగనున్న కల్వకుంట్ల కవిత?

ఎమ్మెల్సీగా బరిలో దిగనున్న కల్వకుంట్ల కవిత?
X

నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌.. దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. కవిత బుధవారం నామినేషన్‌ వేస్తారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిన కవిత.. ఆ తర్వాత రాజకీయంగా యాక్టివ్‌గా కనిపించలేదు. ఆమెను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినప్పటికీ.. తుది జాబితాలో ఆమె పేరు కనిపించలేదు. ఇప్పుడు కవిత ఎమ్మెల్సీగా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. కవిత ఎమ్మెల్సీ అయితే.. రాష్ట్ర రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారనున్నారు.

Tags

Next Story