ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయనున్న కవిత
![ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయనున్న కవిత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయనున్న కవిత](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/03/kavita.png)
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు నిజామాబాద్ వెళ్లారు కవిత. టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆమె బరిలోకి దిగుతున్నారు. గురువారం నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఎమ్మెల్యేలతో కలిసి మరి కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. అంతకుముందు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కవిత.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్, బీజేపీ బరిలో నిలిచినప్పటికీ.. టీఆర్ఎస్ అభ్యర్థి కవిత విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్కు 592 ఓట్లుండగా, కాంగ్రెస్ ఓట్ల సంఖ్య 142, అలాగే బీజేపీకి 90 ఓట్లున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్ 7న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com