రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న శివరాజ్ సింగ్ చౌహాన్

By - TV5 Telugu |23 March 2020 6:12 PM GMT
బిజెపికి సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు రాత్రి 7 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం కూడా ఆయన ఎంపికను ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేకు విందు కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం లభించడంతో ఇవాళ సాయంత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ చేస్తారు. ఇప్పటికే మూడు సార్లుమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు చౌహన్.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com