పెద్ద మనసు చాటుకున్న దాదా

పెద్ద మనసు చాటుకున్న దాదా
X

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా బాధితులను ఆదుకునేందుకు దాదా ముందుకు వచ్చారు. కోల్‌కతా నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లో తలదాచుకుంటున్న నిరుపేద దినసరి అవసరాల కోసం రూ. 50 లక్షల విలువ చేసే బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాడు.

ప్రభుత్వం కోరితే ఐసోలేషన్‌ సెంటర్‌గా ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియాన్ని ఉపయోగించుకోవడానికి తక్షణమే ఇస్తామని దాదా తెలియజేశాడు. ఆటగాళ్ల గదులతో పాటు స్టేడియంలోని డార్మెటరీని వినియోగించుకోవచ్చునని సూచించాడు.

Tags

Next Story