ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
By - TV5 Telugu |31 March 2020 2:14 PM GMT
ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40 కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు అత్యధికంగా 11 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 9 , విశాఖలో 6 , కృష్ణాలో 5 , తూర్పు గోదావరిలో 4 , అనంతపురంలో 2 , చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయింది. ఇవాళ నమోదైన మొత్తం 17 కేసులు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వారు. వారంతా ఢిల్లీలో ఓ కార్యక్రమానికి వెళ్లి రావడంతో అక్కడ వారికి వైరస్ సోకింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com