భారత్ లో కోవిడ్ -19 కేసులు 2,500 మార్కును దాటింది

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విరుచుకు పడుతోంది. 24 గంటల్లో 400 కి పైగా వైరస్ కేసులు
నమోదు అయ్యాయి. దాంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,500 మార్కును దాటింది. అలాగే మరణాల సంఖ్య 70 కి చేరుకుంది.
శుక్రవారం ఉదయం 11.30 నాటికి, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ మరియు గోవాలో 40 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం 2,500 దాటింది. తాజాగా గుజరాత్లో మరణించిన వారితో కలిపి మరణాల సంఖ్య 70 కి చేరుకుంది.
మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధిక మరణాలు (17), తరువాత తెలంగాణ (9), గుజరాత్ (8), పశ్చిమ బెంగాల్ (6), పంజాబ్ (5), కర్ణాటక (3), ఢిల్లీ (4), జమ్మూ కాశ్మీర్ (2) ), ఉత్తర ప్రదేశ్ (2), కేరళ (2). తమిళనాడు, బీహార్, హిమాచల్ ప్రదేశ్లలో ఒక్కొక్కరు మరణించారు . మహారాష్ట్ర నుండి ఇప్పటివరకు అత్యధికంగా కరోనావైరస్ కేసులు 420 గా నమోదయ్యాయి, తమిళనాడు 309, కేరళ 286 ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com