భారత్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు

భారత్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు
X

భారత్ లో కరోనావైరస్ వ్యాప్తి త్వర త్వరగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించేసిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో 478 తాజా కేసులు నమోదయ్యాయి. దాంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,547 కు పెరిగింది. భారతదేశంలో మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య 2547 కు చేరుకుంది, 163 నయం / విడుదల అయిన వారు ఉన్నారు. ఇక మరణాల సంఖ్య 62 కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక కొత్త వైరస్ సంక్రమణ కేసులను నివేదించాయి, ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ సంఘటన కారణంగా ఈ సంఖ్యలు పెరిగాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

Tags

Next Story