రాళ్లతో దాడి : లాక్ డౌన్ వల్ల గ్రామాల మధ్య గొడవలు

X
By - TV5 Telugu |5 April 2020 9:11 PM IST
నెల్లూరు జిల్లాలో కరోనా భయం రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. విడవలూరు మండలం లక్ష్మీపురం, కొత్తూరు మధ్య కంచె వేయడంతో రెండు గ్రామాల ప్రజలు ఘర్షణకు దిగారు. కరోనా భయంతో ఓ గ్రామంలోని ప్రజలు తమ ఊలోకి ఎవ్వరు రాకుండా కంచె వేశారు.. దాంతో మరో గ్రామం ప్రజలు దీనిపై అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు గ్రామాల మధ్య వివాదం ముదిరి రాళ్ల దాడి వరకు వెళ్ళింది. వందలమంది జనం రోడ్లమీదకు వచ్చి రాలు రువ్వుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com