కరోనా కాటుకు చైనాలో 95 మంది పోలీసులు బలి

కరోనా కాటుకు చైనాలో 95 మంది పోలీసులు బలి

కరోనా మహమ్మారితో పోరులో చైనాలో 95 మంది పోలీసులు, 46 మంది వైద్యసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించింది. శనివారం అక్కడ కొవిడ్‌-19 బాధితులు, మృతుల జాతీయ స్మారకం ఏర్పాటు చేశారు. కోవిడ్‌19పై పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వారికి చైనా నివాళి అర్పించింది. ఈ సందర్భంగా పోలీసు, వైద్య సిబ్బందిలో ఎందరు ప్రాణాలు కోల్పోయారో తొలిసారి ప్రకటించింది. మృతి చెందిన వారిలో 60 మంది పోలీసు ఆఫీస‌ర్లు, 35 మంది స్పెష‌ల్ పోలీసులు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

Tags

Read MoreRead Less
Next Story