అన్ని స్విచ్ ఆఫ్ చేయొద్దు: కర్ణాటక విద్యుత్ శాఖ

X
By - TV5 Telugu |5 April 2020 7:56 PM IST
ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆర్పాలని కర్ణాటక విద్యుత్ శాఖ ఆ రాష్ట్ర ప్రజలకు సూచించింది. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు విద్యుత్ లైట్లు ఆర్పి.. కరోనాపై విజయానికి నాందిగా.. చమురు దీపాలు కానీ.. కొవ్వొత్తి దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలంతా అందుకు అందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక విద్యుత్ శాఖ ఆ రాష్ట్ర ప్రజలకు కీలక సూచన చేసింది. లైట్స్ మాత్రమే ఆఫ్ చేయాలని, అన్నింటినీ స్విచ్ ఆఫ్ చేయొద్దని కోరింది. ఇలా అన్నింటిని.. స్విచ్ ఆఫ్ చేస్తే ట్రిప్ అయ్యే అవకాశం ఉందని.. ఆలా జరిగితే.. సమస్యని పరిష్కరించడానికి చాలా సమయం పడుతుందని తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com