108 సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

108 సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి

108 సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. సూర్యపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్వపల్లి గ్రామ సమీపంలో 108 వాహనంలో విధులు నిర్వహిస్తున్న ఈఎంటీ నిరంజన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ హాస్పటల్‌కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story